సంగారెడ్డి ముంపు ప్రాంతాల్లో జగ్గారెడ్డి పర్యటన

ABN , First Publish Date - 2020-10-18T17:01:33+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపోర్లుతున్నాయి. పలుచోట్ల చెరువులకు, కుంటలకు గండ్లు పడుతున్నయి, అయితే..

సంగారెడ్డి ముంపు ప్రాంతాల్లో జగ్గారెడ్డి పర్యటన

సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపోర్లుతున్నాయి. పలుచోట్ల చెరువులకు, కుంటలకు గండ్లు పడ్డాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలంలో మల్లేపల్లి గ్రామం చెరువు కట్ట తెగింది. దీంతో మల్లేపల్లి-గోపులారం గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెరువు కట్ట తెగడంతో దాదాపుగా రెండు వందల ఎకరాలలో పంట నీట మునిగింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆదివారం కొండాపూర్‎లో పర్యటించి గ్రామస్తులను, రైతులను పరామర్శించారు. పంట నష్టోపయిన రైతులకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెరువు కట్ట పునర్నిర్మాణ పనులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.

Updated Date - 2020-10-18T17:01:33+05:30 IST