ఆర్మీని ఆదానీకి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2022-06-28T01:07:16+05:30 IST

ఆర్మీని ఆదానీకి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు.

ఆర్మీని ఆదానీకి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది: జగ్గారెడ్డి

సంగారెడ్డి: ఆర్మీని ఆదానీకి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు.ఇప్పటికే దేశంలోని ప్రభుత్వ ఆస్తులను అంబానీ, అదానీలకు కట్టబెడుతున్న మోదీ ఇప్పుడు ఆర్మీపై పడ్డారని విమర్శించారు. ఆర్మీలో నాలుగేళ్లు పనిచేసి వచ్చాక అడ్డుక్కుని తినాలా? అని ఆయన ప్రశ్నించారు. జై జవాన్.. జై కిసాన్ అన్నదే కాంగ్రెస్ నినాదం జగ్గారెడ్డి పేర్కొన్నారు.అగ్నిపథ్‌ను రద్దు చేసేవరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.దేశంలోని యువత భవిష్యత్ తో చెలగాటమాడవద్దని ఎమ్మెల్యే జగ్గారెడ్డి హితవు చెప్పారు. 

Updated Date - 2022-06-28T01:07:16+05:30 IST