కోరుట్ల వేములవాడ రహదారిని పరిశీలించిన ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-08-02T06:56:14+05:30 IST
పట్టణంలోని కోరుట్ల వేములవాడ రహదారిని స్థా నిక నాయకులతో కలసి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఆదివారం పరిశీ లించారు.
కోరుట్ల, ఆగస్టు 1: పట్టణంలోని కోరుట్ల వేములవాడ రహదారిని స్థా నిక నాయకులతో కలసి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఆదివారం పరిశీ లించారు. రోడ్డు పరిస్థితిని చూసి మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతిని ధుల పనితీరుపై మండిపడ్డారు. పట్టణంలోని ప్రదాణ రహదారి పరిస్థి తి ఇలా ఉంటే మీరు ఏమి పని చేస్తున్నారని ప్రశ్నించారు. రోడ్డును వెం టనే నిర్మాణం చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని సూచించారు. అదే విధంగా పట్టణంలో వర్షంతో పాటు మిషన్ భగీరథ పనులతో ధ్వం సమైన రోడ్డులను మరమ్మతులు చేయాలని ఆదేశాలను జారీ చేశారు. ప్రజల ఇబ్బందులను తొలగించి సమస్యలను పరిష్కరించాలని అధికా రులకు సూచించారు. ప్రజా సమస్యలను ప్రజాప్రతినిధులు నాయకు లు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పట్టణంలోని కాలేజీ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్లడ్లైట్లను ఎమ్మెల్యే స్థానిక నాయ కులతో శనివారం రాత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అన్నం అనిల్ కుమార్, వైస్ ఛైర్మెన్ గడ్డమీ ది పవన్, కౌన్లిలర్లు ఎంబేరి నాగభూషణం, జిందం లక్ష్మినారాయణ, నాయకులు రుద్ర శ్రీనివాస్లతో పాటు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.