పవన్కల్యాణ్పై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-10-07T21:54:00+05:30 IST
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న మంత్రిని సన్నాసి అన్నాడు అంటే పవన్ కల్యాణ్ సన్నాసిన్నర సన్నాసి అని అన్నాడు.
పశ్చిమగోదావరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న మంత్రిని సన్నాసి అన్నాడు అంటే పవన్ కల్యాణ్ సన్నాసిన్నర సన్నాసి అని అన్నాడు. ‘‘రాజమండ్రిలో కానిస్టేబుల్స్ను తిట్టి అనంతపురంలో మా నాన్న కానిస్టేబుల్ అంటాడు. మనకు తెలిసి పవన్ కల్యాణ్ కు ముగ్గురు భార్యలు, తెలియకుండా ఎంతమంది వున్నారో’’ అని వ్యాఖ్యానించారు. హీరోయిన్ పూనమ్ కౌర్ను ప్రేమించి ప్రెగ్నెసి వస్తే అబార్షన్ చేయించి రూ.5కోట్లు ఇచ్చి సెటిల్ చేశాడని ఆరోపించాడు. పవన్ కల్యాణ్ రెండు రోజులు రాష్ట్రంలో తిరిగితే రాష్ట్రమంతా అల్లకల్లోలమేనన్నారు. తన అస్థికలు దేశమంతా చిమ్మితే తనలాంటోళ్లు పుడతారు అంటే జనసైనికులు, వీరమహిళలు దద్దమ్మలని పవన్ కల్యాణ్ అర్థమా? అని ఆయన ప్రశ్నించారు. జన సైనికులను అసాంఘిక శక్తులుగా మారుస్తున్నాడన్నారు.