రైతులకు అండగా వైసీపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-09-30T11:31:48+05:30 IST

రైతులకు అండగా వైసీపీ ప్రభుత్వం ఉంటుందని రైల్వేకోడూరు ఎమ్మెల్యే, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు.

రైతులకు అండగా వైసీపీ ప్రభుత్వం

ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు


రైల్వేకోడూరు, సెప్టెంబరు 29: రైతులకు అండగా వైసీపీ ప్రభుత్వం ఉంటుందని రైల్వేకోడూరు ఎమ్మెల్యే, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం రైల్వేకోడూరు ఎంపీడీవో కార్యాలయం సభాభవనంలో నియోజకవర్గ స్థాయి వ్యవసాయ సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా చేసిందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు అందిస్తున్నారని తెలిపారు. జలకళ ద్వారా రైతులకు ఉచితంగా బోర్లు, మోటార్లు ఏర్పాటు చేయిస్తున్నారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు, వైసీపీ సీనియర్‌ నాయకుడు రామిరెడ్డి ధ్వజారెడ్డి, యువ నాయకుడు ముద్దలూరు సుబ్బరామరాజు తదితరులు పాల్గొన్నారు.


అలాగే రైల్వేకోడూరు మండలంలో రైతు భరోసా కేంద్రం గోదాములను ఎమ్మెల్యే పరిశీలించారు. రైల్వేకోడూరు పంచాయితీ అధికారులతో పారిశుధ్య పనులు, డ్రైనేజీ వ్యవస్థ, వీధిలైట్లు, పట్టణ సుందరీకరణ తదితర వాటిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. చిట్వేలి రోడ్డు లో బస్‌షెల్టర్‌ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు రవిశంకర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-30T11:31:48+05:30 IST