పలువుర్ని పరామర్శించిన ఎమ్మెల్యే గొట్టిపాటి
ABN , First Publish Date - 2020-06-04T10:12:29+05:30 IST
టీడీపీ నాయకులను ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ బుధవారం పరామర్శించారు.
అద్దంకి, జూన్ 3 : టీడీపీ నాయకులను ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ బుధవారం పరామర్శించారు. పట్టణంలోని రామ్నగర్లో న్యాయవాది రావి హజరత్తయ్య తండ్రి సుబ్బారావు ఇటీవల మృతి చెందగా ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన నర్రావారిపాలేనికి చెందిన నర్రా నాగేశ్వరరావును, భవానీసెంటర్లో ఇటీవల మృతి చెందిన తన్నీరు సుబ్బారావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే రవికుమార్ పరామర్శించారు.