భరత్ నగర్లో రూ.65 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన
ABN , First Publish Date - 2020-09-28T00:03:44+05:30 IST
జూబ్లీహిల్స్ నియోజక వర్గం పరిధిలో ఉన్న బోరబండలోని భరత్నగర్లో కరూ.65లక్షల 35వేల రూపాయలతో నిర్మించే కమ్యూనిటీహాల్కు నియోజక వర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ భూమిపూజ చేశారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజక వర్గం పరిధిలో ఉన్న బోరబండలోని భరత్నగర్లో కరూ.65లక్షల 35వేల రూపాయలతో నిర్మించే కమ్యూనిటీహాల్కు నియోజక వర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ భూమిపూజ చేశారు. ఈ కమ్యూనిటీహాల్ నిర్మాణం పూర్తయితే నియోజక వర్గం ప్రజలకు ఎంతో అనువుగా ఉంటుందని ఎమ్మెల్యే గోపీనాధ్ తెలిపారు. ప్రత్యేకించి పేద, మధ్యతరగతి ప్రజల అవసరాలకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి డి ప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు. ముఖ్యంగా హిందూపూజారి, ముస్లిం ఇమామ్, క్రిస్టియన్ పాస్టర్ పాల్గొనడం విశేషం. అలాగే భరత్నగర్లో 45 లక్షల 30వేల రూపాయలతో నిర్మిస్తున్న వరదనీటి రీమోడలింగ్ ,విడిసిసి రోడ్డు పనులకు కూడా ఎమ్మెల్యే గోపీనాధ్ శంకుస్థాపన చేశారు.