ఎమ్మెల్యే గో బ్యాక్.. కదిరిలో సీపీఐ నిరసన
ABN , First Publish Date - 2021-05-07T09:50:23+05:30 IST
‘‘ఇటీవల విజయనగరం, అనంతపురం, కర్నూలు, హిందూపురంలలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు మరణించిన ఘటనలు మరువకముందే ఇప్పుడు కదిరిలో చనిపోవడం విచారకరం
అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): ‘‘ఇటీవల విజయనగరం, అనంతపురం, కర్నూలు, హిందూపురంలలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు మరణించిన ఘటనలు మరువకముందే ఇప్పుడు కదిరిలో చనిపోవడం విచారకరం. ప్రభుత్వ అసమర్థతను ఎత్తిచూపుతూ గురువారం కదిరిలో సీపీఐ శ్రేణులు స్థానిక ఎమ్మెల్యేను అడ్డుకుని గో బ్యాక్ అంటూ నిరసన తెలిపాయి’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రాష్ట్రమంతా కరోనా కల్లోలం కొనసాగుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. గత 5 రోజులుగా 20 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదవుతున్నాయన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ తూతూమంత్రంగా అమలు చేస్తున్నారని విమర్శించారు.