ఎమ్మెల్యే గండ్ర దంపతులకు కరోనా...
ABN , First Publish Date - 2022-01-19T15:11:21+05:30 IST
జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి, వరంగల్ జడ్పీచైర్ పర్సన్ జ్యోతికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి, వరంగల్ జడ్పీచైర్ పర్సన్ జ్యోతికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. జిల్లాలో పంట నష్టంపై మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు గండ్ర దంపతులు పర్యటించారు. ఆపై మంత్రులతో నర్సంపేట నుంచి హెలికాప్టర్లో గండ్ర దంపతులు హైదరాబాద్కు కలిసి వెళ్లారు. అయితే జ్వరం రావడంతో పరీక్షించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. మరోవైపు భూపాలపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్తో పాటు భూపాలపల్లి ఎస్ఐకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.