ఉద్యమ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్
ABN , First Publish Date - 2021-01-27T06:35:20+05:30 IST
ఉద్యమ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్
ఉయ్యూరు, జనవరి 26 : విద్యార్థి దశ నుంచి ఉద్యమాలే ఊపిరిగా పోరాటాలు చేసి విజయాలు సాధించిన నాయకుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రస్తుతించారు. రాజేంద్ర ప్రసా ద్ రాజకీయ ప్రస్థానం పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక 8వ వార్డులో తోటశ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సిల్వర్ జూబ్లీ వేడుకల్లో రామ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పూల వాసు, జయదేవ్, చిరంజీవి, జరీనీ బేగం పాల్గొన్నారు.