మోతీరాం శతకం ముద్రణకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం
ABN , First Publish Date - 2021-03-07T05:50:55+05:30 IST
వాంకిడి మండలం నగరిగుట్ట గ్రామానికి చెందిన కొలాం తెగకు చెందిన ఆత్రం మోతీరాం రాసిన మోతీరాం శతకం ముద్రణకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు రూ.21వేల ఆర్థిక సహయంను శనివారం అందజేశారు.
ఆసిఫాబాద్ రూరల్, మార్చి 6: వాంకిడి మండలం నగరిగుట్ట గ్రామానికి చెందిన కొలాం తెగకు చెందిన ఆత్రం మోతీరాం రాసిన మోతీరాం శతకం ముద్రణకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు రూ.21వేల ఆర్థిక సహయంను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రజల్లో సాహిత్యం పట్ల శ్రద్ధ తగ్గిపోయిం దని, పుస్తకాలు చదివే పాఠకులు లేరని, విద్యా వంతులు పెరిగేకొద్ది పుస్తకాలు చదివే వారు కరు వైపోయారని అన్నారు.మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ మల్లేష్, చిలువేరు వెంకటేశ్వర్లు, సుధాకర్, చుంచు శ్రీనివాస్ పాల్గొన్నారు.