డాక్టర్‌ భాస్కరరావు ప్రాణాలు కాపాడండి..

ABN , First Publish Date - 2021-05-15T06:48:43+05:30 IST

కరోనాతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రయి వేట్‌ వైద్యశాలలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న డాక్టర్‌ భాస్కర్‌రావుకు మెరుగైన వైద్యసేవలు అందించేలా ప్రభుత్వం చొరవ చూపాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి శుక్రవారం లే ఖ రాశారు.

డాక్టర్‌ భాస్కరరావు ప్రాణాలు కాపాడండి..


సీఎం జగన్‌కు ఎమ్మెల్యే ఏలూరి లేఖ


పర్చూరు, మే 14: కరోనాతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రయి వేట్‌ వైద్యశాలలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న డాక్టర్‌ భాస్కర్‌రావుకు మెరుగైన వైద్యసేవలు అందించేలా ప్రభుత్వం చొరవ చూపాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి శుక్రవారం లే ఖ రాశారు. కారంచేడు ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారని చెప్పారు. కొవిడ్‌ ఫస్టు, సెకండ్‌ వేవ్‌లలో కూడా రోగుల మధ్య ఉంటూ ఎంతో మంది ప్రాణాలను కాపాడి ప్రాణదాతగా ప్రజల్లో గుర్తింపు పొందిన వ్యక్తి భాస్కర్‌రావు అని పేర్కొన్నా రు. అటువంటి వ్యక్తి కరోనా కోరల్లో చిక్కుకొని ప్రాణాపాయ స్ధితిలో కొట్టు మిట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి మంచి వైద్యుడ్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఏలూరి కోరారు. 


Updated Date - 2021-05-15T06:48:43+05:30 IST