దళిత బంధును అడ్డుకునేందుకు ఈటల కుట్ర చేస్తున్నారు- దానం

ABN , First Publish Date - 2021-07-30T20:54:01+05:30 IST

దళితుల సంక్షేమానికి పాటు పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారికి దళితబంధు ప్రవేశ పెడితే దానిని అడ్డుకునేందుకు ఈటల రాజేందర్‌ ప్రయత్నిస్తున్నారని

దళిత బంధును అడ్డుకునేందుకు ఈటల కుట్ర చేస్తున్నారు- దానం

హైదరాబాద్‌: దళితుల సంక్షేమానికి పాటు పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారికి దళితబంధు ప్రవేశ పెడితే దానిని అడ్డుకునేందుకు ఈటల రాజేందర్‌ ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే దానంనాగేందర్‌ ద్వజమెత్తారు. హుజూరాబాద్‌లో దరళితుల చేత బీజేపీనేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కాళ్లుకడిగించుకోవడం పై నాగేందర్‌ ఆగ్రహం వ్యక్త చేశారు. ఏం సాధించామని కాళ్లు కడిగించుకున్నామని ఆయన ప్రశ్నించారు. బంజారాహిల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగేందర్‌ మీడియాతో మాట్లాడారు. 


దళితులకు అండగా నిలబడేందుకు సీఎం కేసీఆర్‌ దళిత బంధు పధకాన్ని ప్రవేశ పెడితే ఈటల రాజేందర్‌, ఆయన పార్టీనేతలుఅడ్డుకునే కుట్రలుచేస్తున్నారని ఆరోపించారు. ఈటల రాజేందర్‌ బామ్మర్ధి దళితులను కించపరుస్తూ మాట్లాతాడు. మరో వైపు ఈటల దళిత బంధుని అడ్డుకునేందుకు కుట్రలుచేస్తున్నారని నాగేందర్‌ విమర్శించారు. 

Updated Date - 2021-07-30T20:54:01+05:30 IST