టీడీపీ నేత పట్టాభిపై నక్కపల్లి స్టేషన్‌లో ఎమ్మెల్యే ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-10-21T06:39:47+05:30 IST

టీడీపీ నేత పట్టాభిపై బుధవారం పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు నక్కపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని తీవ్ర పదజాలంతో టీడీపీ నేత పట్టాభి దూషించారని, తక్షణమే అతనిపై కేసు నమోదు చేయాలని కోరారు.

టీడీపీ నేత పట్టాభిపై  నక్కపల్లి స్టేషన్‌లో ఎమ్మెల్యే ఫిర్యాదు
పాయకరావుపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే బాబూరావు, వైసీపీ నాయకులు


  ’పేట’లో వైసీపీ నిరసన ర్యాలీ

నక్కపల్లి, అక్టోబరు 20 : టీడీపీ నేత పట్టాభిపై బుధవారం పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు నక్కపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని తీవ్ర పదజాలంతో టీడీపీ నేత పట్టాభి దూషించారని, తక్షణమే అతనిపై కేసు నమోదు చేయాలని కోరారు.  ఈ మేరకు సీఐ వి.నారాయణరావుకు ఫిర్యాదు అందజేశారు.  డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, వైసీపీ నేతలు పొడగట్ల పాపారావు, అయినంపూడి మణిరాజు, వెలగా ఈశ్వరరావు, సూరకాసుల గోవింద్‌, గంటా తిరుపతిరావు, పల్లా చిన్నబ్బాయి, అల్లు రమణ,కొర్ని రాజా రమేశ్‌, శీరం నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

పాయకరావుపేట:  ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని దుర్భాషలాడినందుకు నిరసనగా బుధవారం పాయకరావు పేటలో వైసీపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు.  గౌతమ్‌ సెంటర్‌ నుంచి మంగవరం రోడ్డు వరకు రాలీ నిర్వహించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, ఎంపీపీ ఇసరపు పార్వతి, ఇసరపు తాతారావు, జడ్పీటీసీ సభ్యుడు లంక సూర్యనారాయణ, ధనిశెట్టి బాబూరావు, గూటూరు శ్రీనివాసరావు, గారా ప్రసాద్‌, జగతా శ్రీను, కాదా రామకృష్ణ, చోడిపల్లి శ్రీను, పల్లాల లచ్చబాబు, డి.నానాజీ, రామకృష్ణ, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T06:39:47+05:30 IST