ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-10-27T17:06:39+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనపై పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు ప్రశంసలు గుప్పించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన ‘జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాస్‌’ పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు. మంగళవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన..

ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి : ఎమ్మెల్యే

విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనపై పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు ప్రశంసలు గుప్పించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన ‘జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాస్‌’ పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు. మంగళవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. గిరిజన, దళిత బిడ్డలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం జగన్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇంతమంచి పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు అంశంపైనా ఎమ్మెల్యే స్పందించారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయంలోగా పూర్తి చేస్తామన్నారు.

Updated Date - 2020-10-27T17:06:39+05:30 IST