ఈటల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టే
ABN , First Publish Date - 2021-06-15T04:53:17+05:30 IST
ఈటల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టే
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల, జూన్ 14 : భారతీయ జనతా పార్టీలో చే రుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టేనని, వ్యక్తులు పార్టీ మారి నంత మాత్రాన టీఆర్ఎస్కు ఒరిగే నష్టం ఏం లేదని, వ్యవస్థను నడిపే నాయకుడు కేసీఆర్ అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కమలాపురం మండ ల టీఆర్ఎస్ ఇన్చార్జిలు, ఆర్ఎంపీలు ఎమ్మెల్యే ధర్మా రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. టీఆర్ఎస్కే పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ఆర్ఎంపీలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ హ యంలో జరిగిన అభివృద్ధిని ప్రతీ ఒక్కరు గమనించా లన్నారు. ఆర్ఎంపీలకు గ్రామాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆరోగ్యపరమైన సమస్యలకు ప్రజలకు అందు బాటులో ఉంటరన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం లో అభివృద్ధి కోసం మంజూరు చేసిన ప్రతీపైసా కేసీ ఆర్ ఇచ్చినవేనన్నారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, సోదా రామకృష్ణ, నేతాని శ్రీనివాసరెడ్డి, ఒరుగంటి రమేష్, దావు రాజిరెడ్డి, రవీం దర్ ఉన్నారు.