తీరు మార్చుకోకపోతే వేటు తప్పదు
ABN , First Publish Date - 2020-05-24T09:13:40+05:30 IST
ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అర్హులకు చోటు కల్పించకుండా ముడుపులు తీసుకొని అనర్హులకు చోటు కల్పిస్తే అట్టివారిపై ..
మరోసారి వీఆర్వోలను హెచ్చరించిన ఎమ్మెల్యే బుర్రా
పామూరు, మే 23: ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అర్హులకు చోటు కల్పించకుండా ముడుపులు తీసుకొని అనర్హులకు చోటు కల్పిస్తే అట్టివారిపై వేటు తప్పదని ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్ హెచ్చరించారు. శనివారం స్థానిక వైసీపీ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో వీఆర్ఓలతో ఇంటి స్థలాల కేటాయింపులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం డీవి పాలెంలో డీప్ బోరును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
అర్హులకు ఇంటి నివేశన స్థలాలు పంపిణీ చేస్తాం
వెలిగండ్ల : నివేశ స్థలాలకు అర్హులైన వారికి అందిస్తామని ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నివేశన స్థలాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తహసీల్దార్ వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.
సీఎస్పురం : ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికి నివేశన స్థలాలు ఇవ్వాలని కనిగిరి శాసనసభ్యుడు బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు