మహనీయుల ఆశయసాధన కోసం కృషి చేయాలి: ఎమ్మెల్యే బాలరాజు
ABN , First Publish Date - 2021-08-16T01:05:45+05:30 IST
మహనీయుల ఆశయసాధన కోసం కృషి చేయాలి: ఎమ్మెల్యే బాలరాజు
జంగారెడ్డిగూడెం: 75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా బుట్టాయిగూడెం మండలం తెల్లంవారిగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, తెల్లంవారి గూడెం సచివాలయం, దొరమామిడి సచివాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ దేశ స్వాతంత్యం కోసం ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేశారన్నారు. ఆ మహనీయుల ఆశయసాధ కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య పాలన సీఎం జగన్ సాగిస్తున్నారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సీఎం జగన్ ఎనలేని కృషి చేస్తున్నారని బాలరాజు పేర్కొన్నారు.