బొత్సగారూ.. పందెంకు సిద్ధమా?: అచ్చెన్న సవాల్

ABN , First Publish Date - 2020-02-16T14:44:43+05:30 IST

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.

బొత్సగారూ.. పందెంకు సిద్ధమా?: అచ్చెన్న సవాల్

అమరావతి : ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. ఇటీవల మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అచ్చెన్న ట్విట్టర్ వేదికగా ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


అచ్చెన్న ట్వీట్ ఇదీ..!

‘ ఎవరు యువకులు - ఎవరు ముసలివాళ్ళు..  గౌరవ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు.. ప్రతి పక్ష నాయకుడు అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముసలి వారు అయ్యారు అని వ్యంగ్యంగా (ఒకరకంగా గేలిచేస్తూ) అవాకులు చవాకులు పేలుతున్నారు. ఎవరు ముసలి వాళ్ళో-ఎవరు యువకులో తేల్చటానికి ఒక చిన్న పోటీ పెడదాం. బొత్స సత్యనారాయణ గారు (ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్‌లోని ఏ మంత్రిగారైనా సరే) చంద్రబాబు గారి కన్నా ముందు కాలినడకన తిరుమల కొండ ఎక్కండి?. ఎవరు ముందు ఎక్కితే వారు కుర్రోళ్ళు. మిగిలిన వారు ముసలోళ్ళు!!. ఈ పోటీకి బొత్సగారూ సిద్ధమేనా!. పోటీకి సిద్ధంకాకపోతే ముసలివాణ్ణి అని పత్రికాసమావేశంలో ఒప్పుకోండి!’ అని బొత్సకు ఎమ్మెల్యే అచ్చెన్న సవాల్ విసిరారు.

Updated Date - 2020-02-16T14:44:43+05:30 IST