నిరాశ్రయుల కోసం చిత్తూరులో వసతి గృహం

ABN , First Publish Date - 2020-04-04T09:37:12+05:30 IST

చిత్తూరులో నిరాశ్రయులు, యాచకులు, వలస కూలీలు, పేదల కోసం ప్రత్యేక వసతి గృహాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు.

నిరాశ్రయుల కోసం చిత్తూరులో వసతి గృహం

చిత్తూరు, ఏప్రిల్‌ 3: చిత్తూరులో నిరాశ్రయులు, యాచకులు, వలస కూలీలు, పేదల కోసం ప్రత్యేక వసతి గృహాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం వేలూరు రోడ్డులోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని ఆయన కమిషనర్‌తో కలిసి సందర్శించారు. లాక్‌డౌన్‌  నేపథ్యంలో ఈ వసతి గృమంలో ఆశ్రయం పొందవచ్చన్నారు. వైద్య సేవల కోసం డాక్టర్లు, అంబులెన్స్‌ సిద్ధంగా ఉంచుతామన్నారు.   అన్నదానం చేసే దాతలు భోజనాన్ని నేరుగా వసతి గృహానికి చేర్చాలన్నారు.  కార్యక్రమంలో వసతి గృహ ఇన్‌ఛార్జి వర్మ, అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2020-04-04T09:37:12+05:30 IST