తెనాలి ప్రభుత్వాస్పత్రి సిబ్బందిపై ఎమ్మెల్యే అన్నబత్తున ఫైర్

ABN , First Publish Date - 2022-01-07T19:16:14+05:30 IST

తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగులపై ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఫైర్ అయ్యారు.

తెనాలి ప్రభుత్వాస్పత్రి సిబ్బందిపై ఎమ్మెల్యే అన్నబత్తున ఫైర్

గుంటూరు:  తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగులపై ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఫైర్ అయ్యారు. కోవిడ్ థర్డ్ వేవ్‌పై సబ్ కలెక్టర్ నిధి మీనాతో కలసి ఎమ్మెల్యే శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఒక్కరికి జవాబుదారితనం లేదన్నారు. ఆసుపత్రిలో ఎవరిదారి వారిదే అన్నట్లు వ్యవహారిస్తున్నారని అన్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రజలతో తాము మాటలు పడుతున్నామన్నారు. ఎన్నిసార్లు హెచ్చరించిన ఉద్యోగులలో మార్పు రావడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం పేదలకు ఆరోగ్యం కోసం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటే ఇక్కడి ఉద్యోగులు మాత్రం నీరు గారుస్తున్నారన్నారు. సలహా కమిటీ సమావేశంలో నిర్ణయలను సిబ్బంది అమలు చేయలేదని తెలిపారు. ఇలాగే కొనసాగితే... ఆసుపత్రి అభివృద్ధి కమిటి ఛైర్మన్ పదవి నుంచి వైదోలుగితానని... ఇదే అంశంపై ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ఎమ్మెల్యే శివ కుమార్ అన్నారు. 

Updated Date - 2022-01-07T19:16:14+05:30 IST