ఏపీ కేబినెట్ మార్పుపై ఎమ్మెల్యే ఆనం కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-04-08T20:52:31+05:30 IST
తిరుపతి: ఏపీ కేబినెట్ మార్పుపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి: ఏపీ కేబినెట్ మార్పుపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ స్పీకర్, మంత్రి పదవి రేసులో తాను లేనని స్పష్టం చేశారు. తనకు వస్తదా? రాదా? అనేది ఊహాజనితమన్నారు. ఊహల్లో ఉండే రాజకీయాలు తాను చేయనన్నారు. కేబినెట్ ఏర్పాటు పూర్తిగా సీఎం జగన్రెడ్డి నిర్ణయమని అన్నారు. పదవులపై గవర్నర్కు లిస్ట్ వెళ్లి ఫోన్లు వచ్చే వరకు ఎవరికీ తెలీదన్నారు. అసెంబ్లీ సమావేశాలు కూడా నియోజకవర్గం అభివృద్ధి కోసమే తప్ప.. తన సొంత రాజకీయ భవిష్యత్ కోసం వాడుకోలేదని.. వాడుకోనని ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.