ఎన్నికల హామీలను వైసీపీ నెరవేర్చలేదు..

ABN , First Publish Date - 2021-02-24T05:42:34+05:30 IST

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ విమర్శించారు.

ఎన్నికల హామీలను వైసీపీ నెరవేర్చలేదు..
ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌

ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌

రేపల్లె, ఫిబ్రవరి 23:  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  రెండేళ్ళ పాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదన్నారు. నిరుద్యోగం నిర్మూలించేందుకు ఏ ఒక్క పరిశ్రమ తేలేదన్నారు. టీచర్లకు పాతపింఛన్‌ విధానం కొనసాగిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు.  25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తామని ప్రగల్భాలు పలికిన జగన్మోహనరెడ్డి  రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. విశాఖ ఉక్కును కేంద్రం చేతుల్లో పెట్టేలా కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.  నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితి లేదన్నారు.  సమావేశంలో  గూడపాటి శ్రీనివాసరావు, కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు, వడ్డి లక్ష్మోజి, రేపల్లె పాపారావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-24T05:42:34+05:30 IST