ఎమ్మెల్యేకు సన్మానం

ABN , First Publish Date - 2020-09-23T05:55:21+05:30 IST

రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల సమస్య గు రించి అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను మంగళవారం భవన నిర్మాణ

ఎమ్మెల్యేకు సన్మానం

బెల్లంపల్లి, సెప్టెంబరు 22: రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల సమస్య గు రించి అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను మంగళవారం భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు సన్మానించారు. అసంఘటిత కార్మిక సంఘం అధ్యక్షుడు, కౌన్సిలర్‌ గెల్లి రాజలింగుయాదవ్‌ మాట్లాడుతూ భవన నిర్మా ణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే చర్చించడం ఆనందంగా ఉందన్నారు. సంఘం నాయకులు రాంకుమార్‌, రాజం, కుమార్‌, కృష్ణ, టీఆర్‌ఎస్‌ నాయకులు భీమాగౌడ్‌, బొడ్డు నారాయణ, కౌన్సిలర్లు కృష్ణ, సురేష్‌, రామునాయక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-23T05:55:21+05:30 IST