నాలాలను శుభ్రం చేయండి: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-05-28T09:23:33+05:30 IST
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే నాలాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని
మెహిదీపట్నం, మే 27 (ఆంధ్రజ్యోతి): రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే నాలాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని కార్వాన్ ఎ మ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ఆదేశించారు. నాలాల్లో చెత్త పేరుకుపోయి ఉండడం తో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హకీంపేటలోని తన కార్యాలయంలో జీహెచ్ఎంసీ, పలు విభాగాల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కరోనా, వర్షాకాలం నేపథ్యంలో పరిసరాలను, నాలాను శుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో నానాల్నగర్ కార్పొరేటర్ మహ్మద్ నషీరొద్దీన్ పాల్గొన్నారు.