‘కుమారస్వామి’ రూపంలో స్టాలిన్‌

ABN , First Publish Date - 2021-01-25T11:38:05+05:30 IST

నాస్తికవాద పార్టీ డీఎంకేకి అధ్యక్షుడుగా వున్న ఎంకే స్టాలిన్‌ కొత్తగా దర్శన మిచ్చారు. కుమారస్వామి కొలువుదీరిన తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి అమ్మయార్‌ కుప్పంలో శనివారం రాత్రి జరిగిన బహి...

‘కుమారస్వామి’ రూపంలో స్టాలిన్‌

చెన్నై(ఆంధ్రజ్యోతి): నాస్తికవాద పార్టీ డీఎంకేకి అధ్యక్షుడుగా వున్న ఎంకే స్టాలిన్‌ కొత్తగా దర్శన మిచ్చారు. కుమారస్వామి కొలువుదీరిన తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి అమ్మయార్‌ కుప్పంలో శనివారం రాత్రి జరిగిన బహి రంగసభలో పాల్గొన్న స్టాలిన్‌కు కార్య కర్తలు బహూకరించిన వెండి శూల (వేలాయుధ) ధారిగా వేదికపై కనిపిం చారు. ఈ చిత్రం ఇప్పుడు రాష్ట్ర రాజకీ యాల్లో సంచలనం రేపుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలనను సంహ రించే వేలాయుధధారిగా స్టాలిన్‌ మారా రని డీఎంకే కార్యకర్తలు సంబరపడు తుండగా.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం దుమ్మెత్తిపోస్తున్నాయి. ద్రావిడ సిద్ధాంత పితామహుడు పెరియార్‌ రామస్వామి, ఆయన శిష్యులు, మాజీ ముఖ్య మంత్రు లు అన్నాదురై, కరుణానిధిల అడుగు జాడల్లో నడుస్తూ వారిలాగే నాస్తిక సిద్ధాంతా లను పాటిస్తున్నట్లు చెబుతున్న స్టాలిన్‌.. ఆస్తికుల ఓట్ల కోసమే ఇలా కొత్త అవతార మెత్తారని విమర్శిస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అయితే.. ‘ఇన్నాళ్లూ దేవుణ్ని కించపరిచేలా మాట్లాడి.. ఇప్పుడు ఓట్ల కోసం వేషం మార్చినంత మాత్రాన ఆయనకు వరం దక్కదు’ అని శాపనార్థాలు పెట్టారు.

Updated Date - 2021-01-25T11:38:05+05:30 IST