అసోం పోలీసులను చంపుతానని బెదిరించి, చిక్కుల్లో పడిన మిజోరం ఎంపీ!
ABN , First Publish Date - 2021-07-29T13:10:21+05:30 IST
అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన...
న్యూఢిల్లీ: అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మిజోరం ఎంపీ కే వన్లాల్వెనాపై అసోం పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. అసోం పోలీసులను బహిరంగంగా చంపుతానిని ఆ ఎంపీ బెదిరించారు. దీనిపై ఉన్నతాధికారులకు, సీఐడీకి ఫిర్యాదు చేసేందుకు అసోం పోలీసులు ఢిల్లీకి పయనమయ్యారు.
కాగా పార్లమెంటు ఎదుట మీడియాతో మాట్లాడిన వన్లాల్ వెనా... ‘200 మందికిపైగా పోలీసులు తమ ప్రాంతంలోకి ప్రవేశించి, తమ పోలీసు సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారని, తాము చర్యలు చేపట్టేలోగానే వారు కాల్పులకు ఆదేశాలిచ్చారన్నారు. అదృష్టం బాగుండి వాళ్లు బతికిపోయారు. ఒకవేళ వారు మరోమారు ఇటువైపువస్తే వారిని అంతం చేసి తీరుతాం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా ఇరు రాష్ట్రాల పోలీసు బలగాల మధ్య జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆరుగురు అసోం పోలీసులతో పాటు ఒక సామాన్య పౌరుడు మృతి చెందాడు.