మిథాలీ సాయం 10 లక్షలు
ABN , First Publish Date - 2020-03-31T10:15:01+05:30 IST
కొవిడ్-19 మహమ్మారిపై పోరు కోసం తెలుగమ్మాయి భారత క్రికెట్ మాజీ కె ప్టెన్ మిథాలీరాజ్ రూ. 10 లక్షలు విరాళం ప్రకటించింది. పీఎం కేర్స్ ఫండ్కు, తెలంగాణ...
న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారిపై పోరు కోసం తెలుగమ్మాయి భారత క్రికెట్ మాజీ కె ప్టెన్ మిథాలీరాజ్ రూ. 10 లక్షలు విరాళం ప్రకటించింది. పీఎం కేర్స్ ఫండ్కు, తెలంగాణ సీఎం ఫండ్కు చెరి ఐదేసి లక్షలు ఇవ్వనుంది. ఇక మరో క్రికెటర్ పూనమ్ యాదవ్ రెండు లక్షలివ్వనుండగా, బాక్సింగ్ దిగ్గజం, రాజ్యసభ సభ్యురాలైన మేరీకోమ్ తన నెల వేతనం ప్రకటించింది. ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ భూటియా తన సొంతరాష్ట్రం సిక్కింలో వలసకూలీకి స్థావరం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాడు.