మిషన్‌ భగీరథ నీటిని సేవించండి

ABN , First Publish Date - 2021-01-27T05:50:19+05:30 IST

ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మిషన్‌ భగీరత నీటిని సేవించాలని కలెక్టర్‌ హన్మంతరావు పిలుపునిచ్చారు.

మిషన్‌ భగీరథ నీటిని సేవించండి
మిషన్‌ భగీరథ నీటి బాటిళ్లను ప్రారంభిస్తున్న అధికారులు

 అధికారులకు కలెక్టర్‌ హన్మంతరావు సూచన


సంగారెడ్డి రూరల్‌, జనవరి 26: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మిషన్‌ భగీరత నీటిని సేవించాలని కలెక్టర్‌ హన్మంతరావు పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో మంగళవారం మిషన్‌ భగీరథ నీటి బాటిళ్లను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టి శుద్ధి నీటిని అందిస్తున్నదని చెప్పారు. మిషన్‌ భగీరథ నీటి బాటిళ్లపై అధికారులు, ఉద్యోగులు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, డీఆర్వో రాధికారమణి, మత్స్యశాఖ అధికారి సుజాత పాల్గొన్నారు.


Updated Date - 2021-01-27T05:50:19+05:30 IST