సురక్షితమైన తాగునీరు అందించేందుకే ‘మిషన్‌ భగీరథ’: పోచారం

ABN , First Publish Date - 2021-09-02T23:29:12+05:30 IST

రాష్ట్రంలోని ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందించేందుకే ప్రభుత్వం రూ.40వేల కోట్ల వ్యయంతో మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టిందని

సురక్షితమైన తాగునీరు అందించేందుకే ‘మిషన్‌ భగీరథ’: పోచారం

బాన్సువాడ: రాష్ట్రంలోని ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందించేందుకే ప్రభుత్వం రూ.40వేల కోట్ల వ్యయంతో మిషన్‌ భగీరథ పథకాన్ని చేపట్టిందని, దీని వల్ల గ్రామాల్ల ప్రస్తుతం స్వచ్ఛమైన తాగునీరు అందుతోందని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బోర్లలోని నీరు కలుషితం కావడంతో గతంలో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడేవారన్నారు. ఈ బాధల నుంచి విముక్తి కలిగించడానికే రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీటిని అందిస్తోందని తెలిపారు. గ్రామాల్లో అధికారులు ఎప్పటికప్పుడు పర్యటించి.. ఎలాంటి తాగునీటి సమస్య లేకుండా చూడాలని శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. 

Updated Date - 2021-09-02T23:29:12+05:30 IST