మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ
ABN , First Publish Date - 2020-07-06T10:54:38+05:30 IST
మందమర్రి మండలంలోని సండ్రోన్పల్లి పాలవా గు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున మిషన్ భగీరథ మెయిన్ పైపులైన్ జాయింట్ వద్ద
మందమర్రిరూరల్, జూలై 5: మందమర్రి మండలంలోని సండ్రోన్పల్లి పాలవా గు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున మిషన్ భగీరథ మెయిన్ పైపులైన్ జాయింట్ వద్ద లీకేజీ కావడంతో ఆ నీటి ఉధృతికి రోడ్డు కింద భాగంలో గుంత ఏర్పడింది. ఆదివారం ఉదయం ప్రజలు చూసి స్థానిక జడ్పీటీసీ వేల్పుల రవి, సర్పంచు సల్లూరి సదిలకు సమాచారం అందించగా సంఘటన స్థలం వద్దకు చేరు కుని మిషన్ భగీరథ అధికారులకు తెలియజే శారు. అధికారులు పైపులైన్ వాల్వ్ను ఆపివేసి మరమ్మతులు చేపట్టారు. పాల చెట్టు నుంచి గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో కొన్ని గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మిషన్ భగీరథ డీఈ కృష్ణ, ఏఈ వినయ్లు పైపులైన్ లీకేజీని సరి చేశారు.