ఇంటింటికి మిషన్ భగీరథ నీరందించాలి
ABN , First Publish Date - 2020-10-31T07:14:04+05:30 IST
ఇంటింటికి మిషన్ భగీరథ నీటిని అందించాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి, అక్టోబరు 30 : ఇంటింటికి మిషన్ భగీరథ నీటిని అందించాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిందని, సంబంధిత అధికారులు పనుల్లో నిర్లక్ష్యం చేయ కుండా వ్యవహరించాలన్నారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలు సుకున్నారు. మిషన్ భగీరథ రీస్టోరేషన్ పనులకు సంబంధించి తెలుసుకు న్నారు. పైపులైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. మిషన్ భగీరథ అధికారులతో పాటు సంబంధిత కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.