చౌడాపూర్లో జలజీవన్ మిషన్ బృందం
ABN , First Publish Date - 2020-12-04T05:30:00+05:30 IST
మిషన్భగీరథ పథకం ద్వారా నీటి సరఫరాపై అధ్యయనం చేయడానికి కేంద్ర జలజీవన్ మిషన్ బృందం శుక్రవారం మండల పరిధిలోని చౌడాపూర్ గ్రామాన్ని సందర్శించింది.
కులకచర్ల: మిషన్భగీరథ పథకం ద్వారా నీటి సరఫరాపై అధ్యయనం చేయడానికి కేంద్ర జలజీవన్ మిషన్ బృందం శుక్రవారం మండల పరిధిలోని చౌడాపూర్ గ్రామాన్ని సందర్శించింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ సరఫరా అవుతున్న తాగునీటి గురించి స్థానిక ప్రజలు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. పథకం బాగుందని అభినందించారు. కార్యక్రమంలో జెఎంఎం టీం ఇన్చార్జి సురేష్, రమేశ్, డీఈఈ సుబ్రమణ్యం, జేఈ ప్రణయ్, సర్పంచి రంగారెడ్డి, ఎంపీ టీసీ శంకర్, నాయకులు అశోక్, కృష్ణ, పాల యాదయ్య ఉన్నారు.