మిషన్ అంత్యోదయ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2020-12-05T03:57:23+05:30 IST
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ అంత్యోదయ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు అన్నారు.
చెన్నూరు, డిసెంబరు 4 : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ అంత్యోదయ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు అన్నారు. శుక్రవారం సంతోషిమాత ఫంక్షన్ హాలులో చెన్నూరు, భీమారం, జైపూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాలకు చెందిన పంచాయతీ అధికారులు, కార్యదర్శులకు ఏర్పాటు చేసిన శిక్షణలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. 29 అంశాలకు సంబంధించిన అభివృద్ధి పనులను వారికి వివరించారు. డీఎల్పీవో ప్రభాకర్రావు, ఫణీందర్, ఎంపీవోలు బాపురావు, సతీష్, వీరయ్య, అనిల్కుమార్, సత్యనారాయణ, డీపీఎం నరేందర్, ఆయా మండలాల కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.