కరోనా బాధితుడు అదృశ్యం

ABN , First Publish Date - 2021-05-08T06:29:06+05:30 IST

ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందిన కరోనా బాధితుడు శుక్రవారం అదృశ్యమయ్యాడు.

కరోనా బాధితుడు అదృశ్యం

ఏలూరు ఫైర్‌స్టేషన్‌,  మే 7: ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందిన కరోనా బాధితుడు శుక్రవారం అదృశ్యమయ్యాడు. వీరవాసరం మండలం నందమూరు గరువు గ్రామానికి చెందిన ఎం. తాతారావుకు పాజిటివ్‌ రావడంతో ఏప్రిల్‌ 27న బంధువులు అతనిని ఆశ్రం ఆసుపత్రిలో చేర్చారు. బాధితుడి పరిస్థితి మెరుగుపడ డంతో ఈ నెల 6న ఆస్పత్రి వైద్యులు అతన్ని డిశ్చార్జి చేశారు. అయితే అతను ఇంటికి చేరకపోవడంతో శుక్రవారం తాతారావు కుటుంబ సభ్యులు ఆశ్రం ఆస్పత్రి యాజమాన్యాన్ని నిలదీశారు. ఆస్పత్రి నిర్వాహకులు నిర్లక్ష్య సమాధానం చెప్తున్నా రని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తాతారావును వెతికి అప్పజెప్పాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 


Updated Date - 2021-05-08T06:29:06+05:30 IST