నాయనమ్మతో కలిసి పెళ్లికి వెళ్లిన ఈ 4 ఏళ్ల పాప మళ్లీ తిరిగి రాలేదు.. 6 రోజుల తర్వాత డ్రైనేజీలో శవంగా..

ABN , First Publish Date - 2022-02-17T20:14:03+05:30 IST

ఆ బాలిక తన నాయనమ్మతో కలిసి పెళ్లికి వెళ్లింది.. ఆ పెళ్లిలో ఆమె తప్పిపోయింది..

నాయనమ్మతో కలిసి పెళ్లికి వెళ్లిన ఈ 4 ఏళ్ల పాప మళ్లీ తిరిగి రాలేదు.. 6 రోజుల తర్వాత డ్రైనేజీలో శవంగా..

ఆ బాలిక తన నాయనమ్మతో కలిసి పెళ్లికి వెళ్లింది.. ఆ పెళ్లిలో ఆమె తప్పిపోయింది.. ఎంత వెతికినా దొరకలేదు.. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూడా ఆ పాపను వెతికిపట్టుకోవడంలో విఫలమయ్యారు.. ఆరు రోజుల తర్వాత డ్రైనేజీలో ఆ బాలిక శవం దొరకడంతో అందరూ షాకయ్యారు.. ఆ పాప తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 


బీహార్‌లోని ధవళ్‌పుర గ్రామంలో నివసిస్తున్న కల్లూ యాదవ్ కూతురు గ్యాన్సీ ఈ నెల 10వ తేదీన తన నాయనమ్మతో కలిసి అదే గ్రామంలో ఓ పెళ్లి వేడుకకు వెళ్లింది. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ చిన్నారి అద‌ృశ్యమైంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఎంత వెతికినా దొరకలేదు. దీంతో కల్లూ యాదవ్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు కూడా ఆ చిన్నారి ఆచూకీ తెలుసుకోలేకపోయారు. చివరకు బుధవారం సాయంత్రం గ్రామంలో ఓ కాలవలో గ్యాన్సీ మృతదేహం బయటపడింది. 


గ్యాన్సీ మృతదేహాన్ని చూసిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. ఎవరో హత్య చేసి అక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ కేసులో ముందుకెళ్తామని పోలీసులు చెబుతున్నారు. 

Updated Date - 2022-02-17T20:14:03+05:30 IST