HYD: నగరంలో నలుగురు అదృశ్యం
ABN , First Publish Date - 2022-01-22T16:05:55+05:30 IST
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూనగర్లో నివాసం ఉంటున్న సత్యానంద్ భార్య వందన(40) గురువారం ఇంటి నుంచి
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు,
నేతాజీనగర్లో మహిళ అదృశ్యమయ్యారు.
కేసులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్/బర్కత్పుర: కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూనగర్లో నివాసం ఉంటున్న సత్యానంద్ భార్య వందన(40) గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. రహమత్బాగ్లో నివాసం ఉంటున్న రోహిత్కుమార్ కుమార్తె రోహిణి జైన్(20) ఉద్యోగానికి వెళ్లి తిరిగి రాలేదు. మూసారాంబాగ్కు చెందిన కమల్ అగర్వాల్ కుమార్తె ఆత్మ అగర్వాల్(20) తిలక్నగర్కు వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్లలేదు. వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు.
బోయిన్పల్లి పరిధిలో మహిళ..
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ అదృశ్యమైంది. బోయిన్పల్లి నేతాజీనగర్కు చెందిన ఆకునూరి పుష్పలత(54) ప్రైవేట్ ఉద్యోగిని. కొద్ది సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో కుమార్తె శ్రీలక్ష్మితో కలిసి ఉంటోంది. ఆమె కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. బుధవారం రాత్రి ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లి రాలేదు. అనారోగ్యంతో బాధపడుతున్నానని, తాను వెళ్లిపోతున్నానని, జాగ్రత్తగా ఉండాలంటూ తల్లి లేఖ రాసిందని శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.