పిఠాపురంలో రెండు అదృశ్యం కేసులు

ABN , First Publish Date - 2020-12-05T06:34:08+05:30 IST

పిఠాపురం పట్టణంలో రెండు అదృశ్యం కేసులు నమోదయ్యాయి.

పిఠాపురంలో రెండు అదృశ్యం కేసులు

పిఠాపురం, డిసెంబరు 4: పిఠాపురం పట్టణంలో రెండు అదృశ్యం కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని జగ్గయ్యచెరువు కాలనీకి చెందిన బండారు భవానీ మూడునెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈమెకు విజయవాడకు చెందిన వ్యక్తితో తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహమైంది. మూడు సంవత్సరాలుగా కుటుంబంలో కలహాలు ఉన్నట్టు చెబుతున్నారు. తండ్రి కొల్లు సోమన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరో సంఘటనలో అగ్రహారం ప్రాంతానికి చెందిన బీటెక్‌ విద్యార్థి కె.ఆనందప్రసాద్‌ గురువారం ఉదయం కాకినాడ వెళ్తుతున్నట్టు చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో శుక్రవారం రాత్రి అతడి తల్లి మహాలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు సంఘటనలపై కేసు నమోదు చేసట్టు పట్టణ ఎస్‌ఐ అబ్థుల్‌నబీ తెలిపారు.

Updated Date - 2020-12-05T06:34:08+05:30 IST