అదృశ్యంపై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-03-07T06:51:17+05:30 IST

అదృశ్యంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇరుసుమండలో నేదునూరి సుగుణకుమారి, తన కుమార్తెతో ఈనెల4వతేదీ అర్ధరాత్రి ఇంటి నుంచి అదృశ్యమైంది.

అదృశ్యంపై కేసు నమోదు

అంబాజీపేట, మార్చి 6: అదృశ్యంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇరుసుమండలో నేదునూరి సుగుణకుమారి, తన కుమార్తెతో ఈనెల4వతేదీ అర్ధరాత్రి ఇంటి నుంచి అదృశ్యమైంది. దీంతో ఆమె భర్త చంద్రశేఖర్‌ అంబాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తన ఇంటి సమీపంలోని క్రాప రాజకుమార్‌ ఈనెల5న ఇంటి నుంచి అదృశ్యం కావడంతో ఆ వ్యక్తితో తన భార్య వెళ్లి ఉంటుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఇరుసుమండకు చెందిన క్రాప రాజకుమార్‌ అతడి మూడో కుమార్తెతో అదృశ్యమైనట్టు అతని సోదరుడు క్రాప నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజకుమార్‌ భార్య ఉపాధి కోసం కువైట్‌ దేశానికి వెళ్లింది. రాజకుమార్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేసులు నమోదు చేసినట్టు హెచ్‌సీ వి.శ్రీనివాసరావు తెలిపారు. 


Updated Date - 2021-03-07T06:51:17+05:30 IST