తప్పిన ప్రమాదం!
ABN , First Publish Date - 2020-11-29T06:48:05+05:30 IST
నివర్ తుఫాన్ ప్రభావం కలెక్ట రేట్పై కూడా పడింది. కలెక్టరేట్లోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో వర్షపు నీరు చేరి విధులు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది.
డీఎంహెచ్వో కార్యాలయంలో పడిపోయిన సీలింగ్
కంప్యూటర్లు తడవకుండా పట్టలు కప్పిన వైనం
ఒంగోలు(కలెక్టరేట్), నవంబరు 28: నివర్ తుఫాన్ ప్రభావం కలెక్ట రేట్పై కూడా పడింది. కలెక్టరేట్లోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో వర్షపు నీరు చేరి విధులు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధా నంగా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం పరిస్థితి అధ్వానంగా ఉంది. శని వారం ఉదయం 10.30 సమయంలో కంప్యూటర్ విభాగంలోని రూం లో పీవోపీ (సీలింగ్) పడిపోయింది. ఆ సమయంలో ఒక ఉద్యోగి మా త్రమే విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆ ఉద్యోగి పనిచేసే స్థానం లో కాకుండా మరో పక్క పడటంతో ప్రమాదం తప్పింది. ఆ శాఖ అన్ని సెక్షన్లలో వర్షపు నీరు చేరడంతో కంప్యూటర్లను కాపాడుకొనేం దుకు పట్టలు కప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా వ్యవసాయశాఖ వరండాతో పాటు ట్రెజరీ శాఖ వద్ద కూడా ఇదే పరిస్థితి. ఒకవైపు చిరుజల్లులు పడుతుండటం, ఇంకొక వైపు పైకప్పు నుంచి చెమ్మ కారు తుండటంతో ఉద్యోగులు విధులు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది.