కందుకూరు సీఐకి తప్పిన ప్రమాదం
ABN , First Publish Date - 2021-10-31T22:21:14+05:30 IST
జిల్లాలోని కందుకూరు సీఐ శ్రీరాంకు ప్రమాదం
ప్రకాశం: జిల్లాలోని కందుకూరు సీఐ శ్రీరాంకు ప్రమాదం తప్పింది. గుడ్లూరు మండలంలోని సాలిపేట సముద్ర తీరంలో అనుమానస్పదంగా ఉన్న షిప్ను పరిశీలించేందుకు పోలీసులు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వారు వెళుతున్న మర పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో సీఐ శ్రీరాంతో పాటు మరో ముగ్గురు పోలీసులు ఉన్నట్లు సమాచారం. స్వల్ప గాయాలతో వారు బయట పడటంతో పోలీస్ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.