Miss USA 2019 చెస్లీ క్రిస్టీ ఆత్మహత్య!
ABN , First Publish Date - 2022-01-31T18:05:28+05:30 IST
మిస్ యూఎస్ఏ 2019 పోటీల్లో విజేతగా నిలిచిన చెస్లీ క్రిస్టీ (30) భవనం మీద నుంచి కిందపడి మరణించింది. ఆమె మరణానికి సంబంధించిన వివరాలను అమెరికా పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబం
న్యూయార్క్: మిస్ యూఎస్ఏ 2019 పోటీల్లో విజేతగా నిలిచిన చెస్లీ క్రిస్టీ (30) భవనం మీద నుంచి కిందపడి మరణించింది. ఆమె మరణానికి సంబంధించిన వివరాలను అమెరికా పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం మాన్హాటన్లో ఓ యువతి బిల్డింగ్పై నుంచి కిందపడి చనిపోయిందనే సమాచారం రావడంతో న్యూయార్క్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతి చెందిన యువతిని చెస్లీ క్రిస్టీగా గుర్తించారు. చెస్లీ క్రిస్టీ మరణ వార్తను ఆమె కుటుంబ సభ్యులకు తెలిపి.. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అపార్ట్మెంట్ 29 అంతస్తు నుంచి దూకి చెస్లీ క్రిస్టీ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు బయటపడతాయని చెబుతున్నారు. చెస్లీ క్రిస్టీ మరణ వార్త ఆమె కుటంబ సభ్యులను విషాదంలోకి నెట్టింది. ఇదిలా ఉంటే.. చెస్లీ క్రిస్టీ వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీలో ఎంబీఏతోపాటు న్యాయ శాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకుంది. అనంతరం స్థానికంగా ఉన్న న్యూస్ ఛానల్లో ఆమె రిపోర్టర్గా పని చేసింది.