Samantha: మిస్ తమిళనాడుగా సమంత
ABN , First Publish Date - 2022-08-14T15:51:56+05:30 IST
ఆలిండియా హెయిర్ అండ్ బ్యూటీ అసోసియేషన్ (ఏఐహెచ్బీఏ) ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ‘మిస్ అండ్ మిసెస్ తమిళనాడు’ పోటీలు
చెన్నై, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఆలిండియా హెయిర్ అండ్ బ్యూటీ అసోసియేషన్ (ఏఐహెచ్బీఏ) ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ‘మిస్ అండ్ మిసెస్ తమిళనాడు’ పోటీలు ముగిశాయి. చెన్నైలో జరిగిన ఫైనల్ పోటీల్లో మిస్ తమిళనాడు(Miss Tamil Nadu)గా సమంత, ద్వితీయ స్థానంలో దీప్సికా నిలిచారు. అదే విధంగా శ్రీమతి తమిళనాడుగా జాన్ ప్రిస్కా, ద్వితీయ స్థానంలో జమీలా నిలిచారు. రాష్ట్ర సహకారశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ జె.రాధాకృష్ణన్(Dr. J. Radhakrishnan) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విజేతలను ప్రకటించంతో పాటు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అందాల భామల ర్యాంప్ వాక్ విశేషంగా ఆకట్టుకుంది.