మిస్ ఇండియా వరల్డ్వైడ్ ఖుషీ పటేల్
ABN , First Publish Date - 2022-06-26T08:05:52+05:30 IST
మూడేళ్ల తర్వాత జరిగిన మిస్ ఇండియా వరల్డ్వైడ్-2022 పోటీల్లో బ్రిటన్ విద్యార్థిని ఖుషీ పటేల్ విజేతగా నిలిచారు.
వాషింగ్టన్, జూన్ 25 : మూడేళ్ల తర్వాత జరిగిన మిస్ ఇండియా వరల్డ్వైడ్-2022 పోటీల్లో బ్రిటన్ విద్యార్థిని ఖుషీ పటేల్ విజేతగా నిలిచారు. వైదేహి డోంగ్రే తొలి రన్నరప్, శ్రుతిక మానె రెండో రన్నర్పగా నిలిచారు. ఈ పోటీల్లో పాల్గొన్న 12 మంది ప్రపంచవ్యాప్తంగా వివిధ పోటీల్లో గెలిచినవారే. ఖుషీ పటేల్ బ్రిటన్లో బయోమెడికల్ సైన్సెస్ చదువుతున్నారు. కాగా, మిస్ టీన్ ఇండియా వరల్డ్వైడ్-2022 కిరీటాన్ని గయానాకు చెందిన రోషణి రజాక్ సాధించారు. నవ్య పైంగోల్(అమెరికా), చికిత మలాహ(సురినామ్) తర్వాత స్థానాల్లో నిలిచారని ఇండియా ఫెస్టివల్ కమిటీ తెలిపింది.