మైనర్ బాలికపై 16 మంది అత్యాచారం.. ఆ బాలిక చెప్పింది విని నిర్ఘాంతపోయిన తండ్రి!

ABN , First Publish Date - 2022-02-14T17:41:24+05:30 IST

ఆ బాలిక సమీప అటవీ ప్రాంతంలో గొర్రెలను మేపుతూ ఉంటుంది. ప్రతిరోజు లాగానే శుక్రవారం ఉదయం కూడా గొర్రెలను తీసుకుని అడవిలోకి వెళ్లింది..

మైనర్ బాలికపై 16 మంది అత్యాచారం.. ఆ బాలిక చెప్పింది విని నిర్ఘాంతపోయిన తండ్రి!

ఆ బాలిక సమీప అటవీ ప్రాంతంలో గొర్రెలను మేపుతూ ఉంటుంది. ప్రతిరోజు లాగానే శుక్రవారం ఉదయం కూడా గొర్రెలను తీసుకుని అడవిలోకి వెళ్లింది.. ఉదయం 11 గంటల సమయంలో ఆమెను ఒంటరిగా చూసిన ఐదుగురు వ్యక్తులు బలవంతంగా బైక్ మీద ఎత్తుకెళ్లారు.. కొందరు పిల్లలు ఆ దృశ్యాన్ని చూసి ఊర్లోకి వెళ్లి అందరికీ చెప్పారు.. గ్రామస్థులు ఎంత వెతికినా ఆ బాలిక ఆచూకీ కనిపించలేదు.. చివరకు ఆమె రెండ్రోజుల తర్వాత ఆదివారం ఇంటికి చేరుకుంది.. ఆమె చెప్పింది విని అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. 


రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు సమీపంలోని కోహ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక ప్రతిరోజూ అడవిలో గొర్రెలను మేపుతూ ఉంటుంది. శుక్రవారం ఉదయం ఆమె అడవిలో ఉండగా ఐదుగురు వ్యక్తులు ఆమె దగ్గరకు బైక్‌లపై వచ్చారు. ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లిపోయారు. ఆ ఘటనను కొందరు చిన్నారులు చూసి వెంటనే గ్రామస్థులకు చెప్పారు. గ్రామస్థులు అడవిలో గాలించారు. అయినా ఆ బాలిక ఆచూకీ దొరకలేదు. 


రెండ్రోజుల తర్వాత ఆదివారం మధ్యాహ్నం ఆ బాలిక ఇంటికి చేరుకుంది. తనను ఓ ఇంట్లో బంధించి ఒకరి తర్వాత ఒకరు 16 మంది రెండ్రోజుల పాటు అత్యాచారం చేశారని చెప్పింది. ఎంత ఏడ్చినా వదల్లేదని, ఆహారం కూడా పెట్టలేదని, నిద్రపోనివ్వలేదని ఆ బాలిక తండ్రికి చెప్పింది. వెంటనే ఆ బాలిక తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను మెడికల్ టెస్ట్‌కు పంపించారు. ఫలితం వచ్చిన తర్వాత దర్యాఫ్తు ప్రారంభిస్తామని చెప్పారు. 

Updated Date - 2022-02-14T17:41:24+05:30 IST