మద్యం హోం డెలివరీ అంటూ ఆఫర్...మహిళకు భారీ షాక్!
ABN , First Publish Date - 2021-08-08T21:11:13+05:30 IST
మద్యాన్ని హోం డెలివరీ చేస్తామంటూ ఆన్లైన్ యాడ్లతో పలువురిని మోసగించిన నిందితులను ఢిల్లీ పొలీసులు ఇటీవల అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: మద్యాన్ని హోం డెలివరీ చేస్తామంటూ ఆన్లైన్ యాడ్లతో పలువురిని మోసగించిన నిందితులను ఢిల్లీ పొలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఇటువంటి ఘటనలు ఇటీవల పెరుగుతుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆదివారం నాడు దేశరాజధానిలో పలు ప్రాంతాల్లో రెయిడ్లు జరిపారు. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే నిందితుల చేతిలో మోసపోయిన ఓ మహిళ ఉదంతం కూడా వెలుగులోకి వచ్చింది. లాక్డౌన్ సమయంలో బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తాను ఓ ఆన్లైన్ యాడ్ చూసి ఆర్డర్ ఇచ్చినట్టు బాధితురాలు పేర్కొన్నారు. ఈ క్రమంలో రూ. 25 వేల వరకూ నిందితులను చెల్లించినట్టు తెలిపారు. అడిగినంత ఇచ్చినా కూడా మద్యం హోం డెలివరీ జరగలేదని ఆమె పోలీసుల ముందు వాపోయారు.