కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలొద్దు

ABN , First Publish Date - 2021-03-04T05:17:01+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహాలు వీడి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ కోరారు. బుధవారం రాజీవ్‌నగర్‌ కాలనీలోని అర్బన్‌ హెల్ల్‌సెంటర్‌లో కరోనా టీకా రెండో డోస్‌ను వేయించుకున్నారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలొద్దు

రింగురోడ్డు : కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహాలు వీడి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ కోరారు. బుధవారం రాజీవ్‌నగర్‌ కాలనీలోని అర్బన్‌ హెల్ల్‌సెంటర్‌లో కరోనా టీకా  రెండో డోస్‌ను వేయించుకున్నారు. అనంతరం అక్కడ టీకా ప్రక్రియ రిజిస్ర్టేషన్‌పై ఆరా తీశారు.  అనంతరం  కలెక్టర్‌ మాట్లాడుతూ... 60 ఏళ్లు పైబడిన, బీపీ, షుగర్‌ బాధితులు, 45 ఏళ్లు దాటిన వారికి  ప్రస్తుతం వ్యాక్సిన్‌ వేస్తున్నట్లు తెలిపారు.  వ్యాక్సిన్‌ కోసం ఆన్‌లైన్‌లో ముందుగా పేరు నమోదుచేసుకోవాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-03-04T05:17:01+05:30 IST