57,850 మిర్చి టిక్కీల విక్రయం

ABN , First Publish Date - 2022-07-01T05:35:12+05:30 IST

మిర్చియార్డుకు గురువారం 56,270 టిక్కీలు రాగా. నిల్వ ఉన్న వాటితో కలిపి 57,850 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు.

57,850 మిర్చి టిక్కీల విక్రయం

గుంటూరు, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు గురువారం 56,270 టిక్కీలు రాగా. నిల్వ ఉన్న వాటితో కలిపి 57,850 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా 6,962 టిక్కీలు నిల్వ ఉన్నాయి. గురువారం యార్డులో నాన్‌ ఏసీ కామన్‌ వెరైటీలు క్వింటాల్‌కు కనిష్టంగా రూ. 7,000, గరిష్టంగా రూ. 25,000, నాన్‌ ఏసీ స్పెషల్‌ వెరైటీలకు రూ. 7,000, రూ. 24,500, నాన్‌ ఏసీ తెల్లకాయలకు రూ. 4,000, రూ. 9,800, ఏసీ కామన్‌ వెరైటీకి రూ. 8,000, రూ. 23,000, ఏసీ స్పెషల్‌ వెరైటీకి రూ. 7,500, రూ. 23,500, ఏసీ తెల్లకాయలకు రూ. 5,000, రూ. 8,000 దర లభించినట్లు యార్డు సెక్రెటరీ ఐ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. 


Updated Date - 2022-07-01T05:35:12+05:30 IST