28,371 మిర్చి టిక్కీల విక్రయం

ABN , First Publish Date - 2021-12-04T05:25:34+05:30 IST

మిర్చియార్డుకు శుక్రవారం 27,082 టిక్కీలు రాగా నిల్వ ఉన్న వాటితో కలిపి 28,371 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు.

28,371 మిర్చి టిక్కీల విక్రయం

గుంటూరు, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు శుక్రవారం 27,082 టిక్కీలు రాగా నిల్వ ఉన్న వాటితో కలిపి 28,371 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా 7,992 టిక్కీలు నిల్వ ఉన్నాయి. శుక్రవారం యార్డులో నాన్‌ ఏసీ కామన్‌ వెరైటీలు క్వింటాల్‌కు కనిష్టంగా రూ.7,000, గరిష్టంగా రూ.15,700, నాన్‌ ఏసీ స్పెషల్‌ వెరైటీలకు రూ.7,000, రూ.17,000, నాన్‌ ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.8,500, ఏసీ కామన్‌ వెరైటీకి రూ.7,000, రూ.13,500, ఏసీ స్పెషల్‌ వెరైటీకి రూ.7,000, రూ.17,500, ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.7,200 ధర లభించినట్లు యార్డు సెక్రటరీ ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. 

 

Updated Date - 2021-12-04T05:25:34+05:30 IST