41,073 మిర్చి టిక్కీల విక్రయం

ABN , First Publish Date - 2021-06-18T05:53:27+05:30 IST

మిర్చియార్డుకు గురువారం 39,863 టిక్కీలు వచ్చాయి. నిల్వ ఉన్న వాటితో కలిపి 41,073 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు.

41,073 మిర్చి టిక్కీల విక్రయం

గుంటూరు, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డుకు గురువారం 39,863 టిక్కీలు వచ్చాయి. నిల్వ ఉన్న వాటితో కలిపి 41,073 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా 7,038 టిక్కీలు నిల్వ ఉన్నాయి. గురువారం యార్డులో నాన్‌ ఏసీ కామన్‌ వెరైటీలు క్వింటాల్‌కు కనిష్ఠంగా రూ. 7,000, గరిష్ఠంగా రూ. 15,200, నాన్‌ ఏసీ స్పెషల్‌ వెరైటీలకు రూ. 7,000, రూ. 17,200, నాన్‌ ఏసీ తెల్లకాయలకు రూ. 4,000, రూ. 8,500, ఏసీ కామన్‌ వెరైటీకి రూ. 7,000, రూ. 15,000, ఏసీ స్పెషల్‌ వెరైటీకి రూ. 7,200, రూ. 17,300, ఏసీ తెల్లకాయలకు రూ. 4,500, రూ. 8,500 ధర లభించినట్లు యార్డు సెక్రెటరి ఐ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.  

 

Updated Date - 2021-06-18T05:53:27+05:30 IST